temple

temple : దుర్గ‌మ్మ భక్తులకు విజ్ఞ‌ప్తి.. ఈ మార్ప‌లు తెలుసుకోండి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై వేంచేసి వున్న కనకదుర్గమ్మ అమ్మ‌వారి temple ఆలయానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 26 నుంచి జూన్ 12 వరకు దాదాపు మూడు వారాల పాటు ఇంద్రకీలాద్రి పైకి వెళ్లే ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. ఈ సమయంలో భక్తుల ప్రయాణాలపై కఠిన ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి.

వాహనాలకు నో ఎంట్రీ.. 3 వారాల పాటు నిలిపివేత‌

ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉన్నందున ఆలయ ఈవో మరియు కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • వాహనాలు నిలిపివేత: మే 26 నుంచి జూన్ 12 వరకు టూ వీలర్స్, కార్లు లేదా విక్రయ వాహనాలు ఏవీ కూడా నేరుగా ఘాట్ రోడ్డు ద్వారా temple (ఆలయం) కు చేరుకోవడానికి అనుమతి లేదు.
  • మరమ్మత్తు పనులు: కొండచరియలు విరిగిపడకుండా రక్షణ చర్యలు, అలాగే రోడ్డు రీపేర్ పనులను వేగంగా పూర్తి చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
temple
temple

భక్తులు ఎలా వెళ్లాలి?

ఘాట్ రోడ్డు మూసివేసిన కాలంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు.

  • మెట్ల మార్గం: భక్తులు సాధారణ పద్ధతిలో మెట్ల దారిగుండా నడుచుకుంటూ ఇంద్రకీలాద్రి temple కొండ‌పైకి వెళ్ల‌వ‌చ్చు.
  • లిఫ్ట్ సౌకర్యం: నడవలేని వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్న‌ పిల్లల కోసం అందుబాటులో వున్న‌ లిఫ్ట్ మార్గం ద్వారా ఆలయానికి వెళ్లేలా ఏర్పాట్లు అధికారులు చేశారు.

ఈ తాత్కాలిక మార్పులను భక్తులందరూ గమనించి, కొండపై పనులు సజావుగా సాగడానికి స‌హ‌క‌రించాల‌ని, దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ మండలికి మరియు సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top