నిన్న మొన్నటివరకు కేవలం ఒక మీమ్ పేజీ అనుకున్న cjp (కాక్రోచ్ జనతా పార్టీ) ఇప్పుడు దేశంలోని పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో కేవలం 56 పోస్టులతోనే ఏకంగా 1.5 కోట్ల (15 Million) ఫాలోవర్లను దాటేసి.. అధికార బీజేపీ (8.8 మిలియన్లు) రికార్డును సైతం తుడిచిపెట్టేసింది. అయితే కేవలం కామెడీ కోసమే అనుకున్న ఈ పార్టీ.. తమ అధికారిక వెబ్సైట్లో పెట్టిన మేనిఫెస్టో చూసి ఇప్పుడు రాజకీయ నాయకులు షాక్ అవుతున్నారు.
రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తోన్న డిమాండ్లు!
ఈ డిజిటల్ ఆర్మీ తమ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు చాలా సీరియస్గా, నేటి వ్యవస్థలోని తప్పులను నిలదీసేలా ఉన్నాయి:
- జంపింగ్ జిలానీలపై బ్యాన్: ఏవైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏకంగా 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.
- రిటైర్మెంట్ తర్వాత పదవులు వద్దు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు రిటైర్ అయిన వెంటనే వారికి రాజ్యసభ సీట్లు ఇవ్వడాన్ని పూర్తిగా రద్దు చేయాలి.
- మహిళలకు 50% కోటా: పార్లమెంట్ మరియు క్యాబినెట్ పదవుల్లో మహిళలకు ఖచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
- గోదీ మీడియా అకౌంట్లపై విచారణ: ప్రజలను పక్కదారి పట్టిస్తూ, ప్రభుత్వాలకు భజన చేసే మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై ప్రత్యేక విచారణ జరపాలి.

జనానికి ఏంటి ఉపయోగం?
ఈ పార్టీ వెబ్సైట్ cockroachjantaparty.org లో జాయిన్ అవ్వడానికి యువత ఎగబడుతున్నారు.
- నాలుగు కండిషన్లు: ఈ పార్టీలో చేరాలంటే నాలుగు రూల్స్ ఉన్నాయి.. వారు నిరుద్యోగి అయి ఉండాలి, సోమరిపోతు అయి ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి మరియు దేనినైనా గట్టిగా నిలదీసే (Rant) పవర్ ఉండాలి.
- యువత గొంతుక: పేపర్ లీకేజీలు, నీట్ (NEET) పరీక్షల అవినీతి, విపరీతమైన ఫీజుల దోపిడీపై ఈ cjp గట్టిగా ప్రశ్నిస్తుండటంతో.. దేశంలోని యువతకు ఇది ఒక పవర్ఫుల్ నిరసన వేదికగా ఉపయోగపడుతోంది.
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా వంటి ఫేమస్ లీడర్లు కూడా ఈ డిజిటల్ ఆర్మీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇది కేవలం మీమ్స్ డ్రామా కాదని, భవిష్యత్తులో ఓట్లను కూడా శాసించగల ఒక సరికొత్త సోషల్ మీడియా విప్లవమని నిపుణులు అంచనా వేస్తున్నారు.